Saturday, April 12, 2014

వలస నేతలకు టిక్కెటిస్తే ఊరుకోం...

ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి పార్టీలో చేరేవారికి మంగళగిరి స్థానాన్ని కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని మంగళగిరి తెలుగు తమ్ముళ్ళు స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంత రావు టీడీపీలో చేరుతున్నారన్న వార్తలపై స్థానిక తెలుగు తమ్ముళ్ళు మండిపడ్డారు. పార్టీలోకి వస్తే వచ్చారు కానీ, టిక్కెట్టు మాత్రం వారికి కేటాయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత అయిదు దఫాలుగా మంగళగిరిలో సైకిల్ సింబల్ పోటీ చేయనప్పటికీ పార్టీ పునాదులు చెక్కు చెదరకుండా కాపాడుతున్న నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేసే విధంగా వలస నేతలకు టిక్కెట్టు ఇస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. గత 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న వారికి సీటు కేటాయించాలని వారు డిమాండ్ చేసారు. -Anvesh Leo


No comments:

Post a Comment